Published on Aug 29, 2025
Current Affairs
సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా కమాండోల బృందం
సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా కమాండోల బృందం

ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని ‘కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం’ (సీఐఎస్‌ఎఫ్‌) నిర్ణయించింది. ‘విమానయాన భద్రత బృందం’ (ఏఎస్‌జీ) నుంచి 100 మంది మహిళలను తొలివిడతగా శిక్షణకు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని బర్వాహాలో వీరికి శిక్షణ మొదలైంది. ఎనిమిది వారాలపాటు ఇచ్చే శిక్షణతో వీరు ‘సత్వర ప్రతిస్పందన బృందం’ (క్యూఆర్‌టీ), ప్రత్యేక కార్యదళం (ఎస్‌టీఎఫ్‌)లో సేవలకు సన్నద్ధమవుతారు.