Published on Jun 9, 2025
Current Affairs
సీఆర్‌ఎస్‌ నివేదిక
సీఆర్‌ఎస్‌ నివేదిక

పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌) 2022లో నమోదైన మరణాల గురించి వివరిస్తూ 2025, జూన్‌ 7న నివేదికను విడుదల చేసింది. ఆ ఏడాది దాదాపు 86.5 లక్షల సాధారణ మరణాలు సంభవించినట్లు సీఆర్‌ఎస్‌ వెల్లడించింది. కరోనా ఉద్రిక్త స్థాయిలో ఉన్న 2021లో మరణించిన 1.02 కోట్ల మందితో పోలిస్తే ఇది 15 శాతం తక్కువ అని పేర్కొంది. 2018లో 69.5 లక్షలు, 2019లో 76.4 లక్షలు, 2020లో 81.1 లక్షల సాధారణ మరణాలు నమోదవగా.. 2021లో 1.02 కోట్ల మరణాలు సంభవించాయి.