షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్సీఎల్) ముంబయి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 75
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్: 55
2. ఎగ్జిక్యూటివ్: 20
విభాగాలు: మేనేజ్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్/పర్సనల్, లా, ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ, ఫైర్ సెక్యూరిటీ, నావల్ ఆర్కిటెక్ట్, కంపెనీ సెక్రటరీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఎంఎస్, సీఏ, లా, డిగ్రీ, సీఎస్, బీబీఏ/బీఎంఎస్, హెచ్ఆర్డీ/హెచ్ఆర్ఎం, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.50,000 - రూ.1,60,000, ఎగ్జి్క్యూటివ్ పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 27.