చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశమైన ‘శివశక్తి’ భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు.
చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరీ బృందం రూపొందించింది.
దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు.
భూమిపై తొలి జీవ రూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించాయి.