Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 3, 2026
Current Affairs
‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’
‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’

పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఆదంపుర్‌ విమానాశ్రయం పేరును ‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’గా మార్చారు. ఆయన 15 శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. గురు రవిదాస్‌ జయంతి రోజు ఈ పేరును ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2026, ఫిబ్రవరి 1న ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు రవిదాస్‌ 649వ జయంతి సభలో ఆయన ప్రసంగించారు.