పంజాబ్లోని జలంధర్లో ఉన్న ఆదంపుర్ విమానాశ్రయం పేరును ‘శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ ఎయిర్పోర్టు’గా మార్చారు. ఆయన 15 శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. గురు రవిదాస్ జయంతి రోజు ఈ పేరును ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2026, ఫిబ్రవరి 1న ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు రవిదాస్ 649వ జయంతి సభలో ఆయన ప్రసంగించారు.