శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా హరిణి అమరసూర్య (54) నియమితులయ్యారు. దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే 2024, సెప్టెంబరు 24న ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో హక్కుల కార్యకర్త, విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు హరిణి అమరసూర్యను తరవాతి ప్రధానిగా దేశాధ్యక్షుడు దిసనాయకే నియమించారు.