Published on Sep 23, 2024
Current Affairs
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్‌ జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించారు. 2024, సెప్టెంబరు 22న చేపట్టిన ఓట్ల లెక్కింపులో దిసనాయకే అత్యధిక మెజార్టీ సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర కుమార సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రెండోస్థానంలో ఉన్న విపక్షనేత సజిత్‌ ప్రేమదాస (సమగి జన బలవేగాయా/ఎస్‌జేబీ)కు 32.76శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే తొలి రౌండులోనే పోటీ నుంచి వైదొలిగారు.

మొత్తం 1.7 కోట్ల మంది నమోదిత ఓటర్లలో 75 శాతానికి పైగా ప్రజలు ఓటు వేశారు.