Published on Mar 17, 2025
Current Affairs
శ్రీలంక
శ్రీలంక

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జంతువుల సంఖ్య తెలుసుకునేందుకు 2025, మార్చి 15 నుంచి జంతుగణనను శ్రీలంక ప్రారంభించింది.

గ్రామాల పరిసరాల్లో సంచరించే కోతులు, నెమళ్లు, ఉడతలు, కొండముచ్చుల సంఖ్య గురించి ప్రజల నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించారు.

ఈ సర్వే కోసం దాదాపు 40 వేల మందికిపైగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లారు. జంతువుల వల్ల జరుగుతున్న పంటనష్టాన్ని శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం ఈ సర్వేకు కారణం. 

శ్రీలంకలో 2022లో కేవలం జంతువుల వల్ల 6 నెలల వ్యవధిలో రూ.3 వేల కోట్ల విలువైన పంటనష్టం జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి.