Published on Sep 28, 2024
Current Affairs
శ్రేయాంస్‌ కుమార్‌
శ్రేయాంస్‌ కుమార్‌

దేశంలోని వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి ఎం.వి.శ్రేయాంస్‌కుమార్‌ 2024, సెప్టెంబరు 27న ఎన్నికయ్యారు. ఆయన ప్రముఖ మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా వివేక్‌గుప్త (సన్మార్గ్‌), వైస్‌ ప్రెసిడెంట్‌గా కరణ్‌ రాజేంద్ర దర్డా (లోక్‌మత్‌), గౌరవ కోశాధికారిగా తన్మయీ మహేశ్వరి (అమర్‌ ఉజాల) ఎంపికయ్యారు.