Published on Aug 29, 2024
Current Affairs
శ్రీనివాసులు శెట్టి
శ్రీనివాసులు శెట్టి

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఛైర్మన్‌గా 2024, ఆగస్టు 28న చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. దినేశ్‌ ఖరా స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించారు. 

* శెట్టి బ్యాంక్‌లో ఇప్పటిదాకా అత్యంత సీనియర్‌ ఎండీగా ఉన్నారు. ఎస్‌బీఐలోని సంప్రదాయం ప్రకారం, బ్యాంక్‌ ఎండీల నుంచే ఛైర్మన్‌ నియామకం జరుగుతోంది. సాధారణంగా సీనియర్‌ ఎండీకే ఆ అవకాశం దక్కుతుంటుంది.