Published on Jul 23, 2025
Current Affairs
శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డు
శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డు

ప్రతిష్ఠాత్మక శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది.

రవీంద్రభారతిలో 2025, జులై 22న దేవేందర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అవార్డును బహూకరించారు.

అవార్డుతోపాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, శాలువను అందించారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో దశరథం, కేదారమ్మలకు అన్నవరం దేవేందర్‌ 1962 అక్టోబరు 17న జన్మించారు.