Published on Sep 3, 2024
Current Affairs
శీతల్, రాకేశ్‌ జోడీకి కాంస్యం
శీతల్, రాకేశ్‌ జోడీకి కాంస్యం

పారిస్‌ పారాలింపిక్స్‌ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది. కంచు పతక పోరులో టాప్‌సీడ్‌ శీతల్‌- రాకేశ్‌ 156-155 తేడాతో ఎలోనోరా- మాటియో (ఇటలీ)పై విజయం సాధించారు. 

*  శీతల్‌ 2023 ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. ఈ పోటీల్లో పతకం గెలిచిన చేతుల్లేని మొదటి అమ్మాయి శీతల్‌. ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం నెగ్గింది.

* రాకేశ్‌ కుమార్‌ 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్‌డ్‌ స్వర్ణం గెలిచాడు. ఆసియా పారా క్రీడల్లో ఓ స్వర్ణం, రెండు రజతాలు దక్కించుకున్నాడు.