Published on May 2, 2025
Current Affairs
వేవ్స్‌ 2025
వేవ్స్‌ 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025, మే 1న ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటరులో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌ 2025) ప్రారంభించారు. ఈ సదన్సు దేశంలో జరగడం ఇదే మొదటిసారి. భారత్‌లో ‘ఆరెంజ్‌ ఎకానమీ’ (సృజనాత్మక ఆర్థికవ్యవస్థ) పరిఢవిల్లుతోందని మోదీ తెలిపారు. ప్రపంచం కొత్తదనం కోరుకొంటున్న ఈ తరుణంలో ‘‘భారత్‌లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం’’ నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణమని చెప్పారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు మే 4న ముగుస్తుంది.