Published on Sep 21, 2024
Current Affairs
వివాద్‌ సే విశ్వాస్‌ 2.0
వివాద్‌ సే విశ్వాస్‌ 2.0

ప్రత్యక్ష పన్నుల్లో వివాదాల పరిష్కారం కోసం ప్రారంభించిన వివాద్‌ సే విశ్వాస్‌ 2.0 పథకం అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు 2024, సెప్టెంబరు 20న కేంద్రం నోటిఫై చేసింది. రూ.35 లక్షల కోట్ల విలువైన    2.7 కోట్ల ప్రత్యక్ష పన్నుల వివాదాలు వివిధ న్యాయ వేదికల్లో ఉన్నాయి. సాధ్యమైనంత తొందరగా వీటిని పరిష్కరించేందుకు, పన్ను విధానాలను సరళీకృతంగా మార్చడం, పన్ను చెల్లింపుదారులకు సేవలను పెంచడం కోసం వివాద్‌ సే విశ్వాస్‌ 2.0 ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.