అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి ఘనత సాధించాడు. ఇప్పటివరకు అతడు ఆడిన 194 టెస్టు ఇన్నింగ్స్ల్లో 8918 పరుగులు సాధించాడు. ఇందుల్లో 29 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లి 295 వన్డేల్లో 50 సెంచరీలు, 72 అర్ధసెంచరీలతో 13,906 చేశాడు. అలాగే 125 టీ20ల్లో 4188 పరుగులు చేశాడు.
* అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (34,357), సంగక్కర (28,016), పాంటింగ్ (27,483) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.