Published on Mar 21, 2025
Current Affairs
వయో వృద్ధుల కమిషన్‌ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం
వయో వృద్ధుల కమిషన్‌ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం

కేరళ ప్రభుత్వం 2025, మార్చి 20న సినియర్‌ సిటిజన్ల కోసం ఒక కమిషన్‌ నియామకానికి చట్టం రూపొందించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.

వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకై ఈ కమిషన్‌ పనిచేస్తుందని కేరళ ప్రభుత్వం పేర్కొంది.