Published on Sep 23, 2024
Current Affairs
వాయుసేన కొత్త చీఫ్‌గా అమర్‌ప్రీత్‌ సింగ్‌
వాయుసేన కొత్త చీఫ్‌గా అమర్‌ప్రీత్‌ సింగ్‌

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కొత్త  అధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ 2024, సెప్టెంబరు 21న నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేనకు ఉప అధిపతిగా ఈయన కొనసాగుతున్నారు. 

వాయుసేన అధిపతి మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరీ పదవీకాలం సెప్టెంబరు 30న ముగియనుండటంతో తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్‌ సింగ్‌ను నియమిస్తున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది.