భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్ రేంజ్లో 2026, ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం ‘వాయుశక్తి’ విన్యాసాలను నిర్వహించింది. ఇందులో వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా.. 2025లో ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా నిర్వహించిన దాడులను వాయుసేన అనుకరించింది.