Published on Sep 3, 2024
Current Affairs
వ్యవసాయ ఊతానికి ఏడు పథకాలు
వ్యవసాయ ఊతానికి ఏడు పథకాలు

రైతుల స్థితిగతులను, ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూ.14,235 కోట్లతో ఏడు కొత్త పథకాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024, సెప్టెంబరు 2న జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ పథకాల వల్ల రైతులకు పంటలసాగు, మార్కెటింగ్‌కు సంబంధించి ఉత్తమ శాస్త్రీయ సమాచారం అందుతుందని ప్రభుత్వం పేర్కొంది.