2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ సమయంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికమని తెలిపింది. చైనా సాధించిన 4.10% వృద్ధిరేటు కంటే ఇది అధికమని పేర్కొంది. 2015-16 నుంచి 2024-25 మధ్య ఏ ఒక్క ఏడాదీ ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని తెలిపింది.
మత్స్యరంగం 9% వృద్ధి సాధించింది. పంటలతో పోలిస్తే ఇది రెట్టింపునకంటే ఎక్కువ.
అటవీ ఉత్పత్తుల వృద్ధి కూడా దాదాపు 4 శాతానికి చేరింది.