గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైనవారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు 2025, డిసెంబరు 18న పార్లమెంట్ ఆమోదం లభించింది. మొదట ఆ బిల్లును లోక్ సభ ఆమోదించగా, అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీనరేగా) చట్టాన్ని రద్దుచేసి ఆ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు.