Published on Jun 13, 2025
Current Affairs
వింబుల్డన్‌ విజేతకు రూ.34 కోట్లు
వింబుల్డన్‌ విజేతకు రూ.34 కోట్లు

2025లో వింబుల్డన్‌ టోర్నీ ప్రైజ్‌మనీని రూ.624 కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్ అధికారులు వెల్లడించారు.

గత సీజన్‌తో పోలిస్తే ఈ మొత్తం 7 శాతం అధికం. విజేతగా నిలిచే ప్లేయర్‌ రూ.34 కోట్లు సొంతం చేసుకోనున్నాడు.

2024తో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువ.

ఈ టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కుతుంది.

తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు రూ.76 లక్షలు దక్కనున్నాయి.  

జూన్‌ 30న వింబుల్డన్‌ ఆరంభం కానుంది. జులై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.