- ద్రవ్యోల్బణ అంచనాకు ఉపయోగించే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) లెక్కింపునకు కేంద్ర ప్రభుత్వం కొత్త సూత్రాన్ని అనుసరించడానికి సిద్ధమైంది. వినియోగదారుల వ్యవహార శైలిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకొని ఈ సూచికను కచ్చితంగా నిర్ధారించేందుకు అవసరమైన కొత్త విధాన రూపకల్పన కోసం కేంద్ర గణాంకాల శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఇందులోని ముఖ్యాంశాలు..
- సీపీఐ లెక్కింపునకు ఇప్పటివరకూ ప్రామాణిక సంవత్సరంగా ఉన్న 2011-12కు బదులు 2023-24ను తీసుకోవాలని సిఫార్సు చేసింది.
- సీపీఐ లెక్కింపు కోసం మొత్తం 12 డివిజన్లు, 43 గ్రూపులు, 62 తరగతులు, 192 ఉప తరగతులనుంచి 358 వస్తువులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.