Published on Mar 24, 2025
Current Affairs
వినోద్‌ శుక్లాకు జ్ఞానపీఠ్‌
వినోద్‌ శుక్లాకు జ్ఞానపీఠ్‌

ప్రముఖ హిందీ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లా (88)ను దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్‌ వరించింది.

2024కి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ 2025, మార్చి 22న ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

సృజనాత్మక, విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్యరంగానికి అందించిన విశిష్ట సేవలకు 59వ జ్ఞాన్‌పీఠ్‌కు శుక్లా ఎంపికయ్యారని కమిటీ పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత ఆయనే.

జ్ఞానపీఠ్‌ను అందుకున్న 12వ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు.

పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.