దిల్లీలోని కిరాడీ ప్రాంతానికి చెందిన వినోద్కుమార్ చౌధరి (44) మొబైల్ ఫోను కీబోర్డుపై ముక్కుతో 108 ఆంగ్ల క్యారెక్టర్లను 1.18 నిమిషాల్లో టైప్ చేసి, 21వ సారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విజేతగా నిలిచారు.
ఈ ప్రయత్నంలో 19 గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రపంచ రికార్డును అధిగమించారు.
వినోద్కుమార్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈయన కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తున్నారు. ఈయన్ను ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
2014లో తొలిసారిగా గిన్నిస్బుక్లో స్థానం సంపాదించిన వినోద్ ముక్కుతో వేగంగా టైపింగు చేయడం, కళ్లకు గంతలు కట్టుకొని టైప్ చేయడం, మౌత్ స్టిక్తో టైప్ చేయడం ఇలా వివిధ విన్యాసాలతో 11 ఏళ్లలో 21 సార్లు గిన్నిస్ రికార్డును సృష్టించారు.