Published on Apr 2, 2025
Current Affairs
వందన కటారియా
వందన కటారియా

భారత మహిళల హాకీ వెటరన్‌ ప్లేయర్‌ వందన కటారియా 2025, ఏప్రిల్‌ 1న ఆటకు వీడ్కోలు ప్రకటించింది. హరిద్వార్‌కు చెందిన వందన 2009లో అరంగేట్రం చేసింది.

15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఈ స్ట్రైకర్‌.. 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్‌ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ చేసిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది. 

హాకీలో వందన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ (2022), అర్జున (2021) పురస్కారాలు దక్కాయి.