Published on Dec 17, 2024
Current Affairs
విజయ్‌ దివస్‌
విజయ్‌ దివస్‌

భారతదేశంలో విజయ్‌ దివస్‌ను ఏటా డిసెంబరు 16న నిర్వహింస్తారు. పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్‌ సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని నిర్వహిస్తారు.

పాకిస్థాన్‌ సైనిక పాలకుల నుంచి బంగ్లాదేశ్‌ ప్రజలకు విముక్తి కల్పించిన ఈ యుద్ధంలో భారత సైనికులు అత్యంత కీలకంగా వ్యవహరించారు.

90వేల మంది శత్రు సైనికులు 1971 డిసెంబరు 16న భారత సైన్యానికి లొంగిపోయిన అపూర్వ ఘటనకు గుర్తుగా విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు.