Published on Feb 12, 2025
Current Affairs
‘వికసిత్‌ పంచాయత్‌’
‘వికసిత్‌ పంచాయత్‌’

వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన ‘వికసిత్‌ పంచాయత్‌’ కార్యక్రమానికి గుజరాత్, అస్సాం, ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ ఎంపిక చేసింది.

ఈ కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు. 

అల్లూరి జిల్లాలో ఎంపిక చేసిన పంచాయతీలు:

పాడేరు మండలంలో: కిండంగి, మినుములూరు, గుతులపుట్టు, డోకులూరు, కడెలి, డి.గొందూరు, వంజంగి.

హుకుంపేట మండలం: మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకే మందా, తాడిపుట్టు.జి.మాడుగుల మండలం: బోయితిలి.