వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన ‘వికసిత్ పంచాయత్’ కార్యక్రమానికి గుజరాత్, అస్సాం, ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఎంపిక చేసింది.
ఈ కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు.
అల్లూరి జిల్లాలో ఎంపిక చేసిన పంచాయతీలు:
పాడేరు మండలంలో: కిండంగి, మినుములూరు, గుతులపుట్టు, డోకులూరు, కడెలి, డి.గొందూరు, వంజంగి.
హుకుంపేట మండలం: మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకే మందా, తాడిపుట్టు.జి.మాడుగుల మండలం: బోయితిలి.