Published on Mar 27, 2025
Current Affairs
వీఎల్‌ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం
వీఎల్‌ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే స్వల్పశ్రేణి క్షిపణి (వీఎల్‌ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం)ని 2025, మార్చి 26న మన దేశం విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశాలోని చాందీపుర్‌ ఇందుకు వేదికైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి.

ఉపరితలంపై ఉండే నిట్టనిలువు ప్రయోగసాధనం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా అత్యంత వేగంతో ఆకాశంలో దూసుకుపోతున్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో నాశనం చేసిందని రక్షణశాఖ వెల్లడించింది.