Published on Apr 16, 2025
Current Affairs
లా కమిషన్‌ ఛైర్మన్‌
లా కమిషన్‌ ఛైర్మన్‌

న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి 2025, ఏప్రిల్‌ 15న నియమితులయ్యారు. 2024, సెప్టెంబరు 3న 23వ లా కమిషన్‌ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. తాజాగా ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, కమిషన్‌ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్‌ జైన్‌ (న్యాయవాది), ప్రొఫెసర్‌ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్‌- బీహెచ్‌యూ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్‌ పదవీ కాలం 2027 ఆగస్టు 31వరకు కొనసాగనుంది. గత లా కమిషన్‌లో కూడా వర్మ సభ్యుడిగా ఉన్నారు. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచవచ్చో లేదో కూడా లా కమిషన్‌ పరిశీలించనుంది.