ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2024, సెప్టెంబరు 23న హిందీ సినిమా ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్ పురస్కారాలకు మనదేశం నుంచి అధికారికంగా ఎంపిక చేసింది. దర్శక నిర్మాత కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమా 2024, మార్చి 1న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించారు. సుప్రీం కోర్టు 75ఏళ్ల వేడుకల్లోనూ దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.