Published on Sep 24, 2024
Current Affairs
‘లాపతా లేడీస్‌’
‘లాపతా లేడీస్‌’

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 2024, సెప్టెంబరు 23న హిందీ సినిమా ‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌ పురస్కారాలకు మనదేశం నుంచి అధికారికంగా ఎంపిక చేసింది. దర్శక నిర్మాత కిరణ్‌ రావు తెరకెక్కించిన ఈ సినిమా 2024, మార్చి 1న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఆమిర్‌ ఖాన్‌ నిర్మించారు. సుప్రీం కోర్టు 75ఏళ్ల వేడుకల్లోనూ దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.