Published on Apr 14, 2025
Current Affairs
లేజర్‌ అస్త్రం
లేజర్‌ అస్త్రం

శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత లేజర్‌ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది.

కర్నూలులోని నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌లో 2025, ఏప్రిల్‌ 13న ఈ పరీక్ష జరిగింది. ఈ ఆయుధానికి మార్క్‌-2(ఏ) డీఈడబ్ల్యూ అని పేరు పెట్టారు. 

దీంతో అత్యంత శక్తిమంతమైన లేజర్‌- డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ (డీఈడబ్ల్యూ) వ్యవస్థ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరినట్లయింది.

ఈ అస్త్రాలను అమెరికా, చైనా, రష్యాలు విజయవంతంగా పరీక్షించాయి.

ఇజ్రాయెల్‌ కూడా వీటిపై ప్రయోగాలు చేస్తోంది.

ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌.. సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌) అభివృద్ధి చేసింది.

దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఇందులో పాలుపంచుకున్నాయి.