ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 2025 ఏడాదికి గాను వెలువరించిన లింగ సమానత్వ సూచీలో భారత్ 131వ ర్యాంకులో నిలిచింది. కేవలం 64.1 శాతం సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాల సరసన భారత్ నిలిచింది. 2024లో భారత్ 129వ ర్యాంకులో ఉంది. స్త్రీ, పురుషుల ఆర్థిక భాగస్వామ్యం - అవకాశాలు, విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్య- జీవన స్థితిగతులు, రాజకీయ సాధికారత లాంటి నాలుగు అంశాల ఆధారంగా 148 దేశాలకు డబ్ల్యూఈఎఫ్ ర్యాంకులను కేటాయించింది. ఈ జాబితాలో వరుసగా 16వ సారి ఐస్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే ఉంది.