భారత యువ వెయిట్లిఫ్టర్ లోగనాథన్ ధనుష్ (17) ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం నెగ్గాడు. 2024, సెప్టెంబరు 20న జరిగిన పురుషుల 55 కేజీల విభాగంలో మొత్తం 231 (107+124) కేజీల బరువెత్తిన ధనుష్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో పతకం గెలిచిన భారత తొలి పురుష వెయిట్లిఫ్టర్గా రికార్డు సృష్టించాడు.
* దువాంగ్ (వియత్నాం- 253 కేజీలు), తొమరి (జపాన్- 247 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు నెగ్గారు.