బ్యాంకులు గత 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ (సాంకేతికంగా రద్దు) చేశాయని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పేర్కొన్నారు. 2019-20లో అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేయగా.. 2024-25లో ఇవి రూ.47,568 కోట్లకు పరిమితం అయ్యాయి. 2014-15లో రూ.31,723 కోట్లు, 2015-16లో రూ.40,416 కోట్లు, 2016-17లో రూ.68,308 కోట్లు, 2017-18లో రూ.99,132 కోట్ల చొప్పున రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు లోక్సభకు మంత్రి రాతపూర్వకంగా తెలిపారు.