Published on Dec 27, 2024
Current Affairs
రాష్ట్రీయ బాలపురస్కార్‌
రాష్ట్రీయ బాలపురస్కార్‌

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్‌ క్రీడాకారిణి జెస్సీరాజ్‌ మాత్రపు (14) 2024, డిసెంబరు 26న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ను అందుకుంది.

స్కేటింగ్‌లో అసాధారణ కళాత్మకత చూపినందుకు ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం వరించింది. 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొత్తం 7 విభాగాల్లో 17 మంది బాలలకు ఈ పురస్కారాలు అందించారు.