స్వతంత్ర భారతదేశపు తొలి, ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. అశోక మండపం సమీపంలోని గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్ విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు.