Published on Jun 30, 2025
Current Affairs
రవి అగర్వాల్‌
రవి అగర్వాల్‌

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ రవి అగర్వాల్‌ పదవీ కాలాన్ని ఒక ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి ఆయన 2025, జూన్‌ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా... ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2026 జూన్‌ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

1988 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌) అధికారి అయిన రవి అగర్వాల్‌ సీబీడీటీ ఛైర్మన్‌గా 2024 జూన్‌లో నియమితులయ్యారు.