భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్-డి ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్(CEN నెం. 09/2025) జారీ చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే(సికింద్రాబాద్)లో మొత్తం 1,012 ఖాళీలున్నాయి.
వివరాలు:
లెవల్-1 గ్రూప్-డి: 22,195 ఖాళీలు (సుమారుగా)
పోస్టులు: పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి.
ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పుర్, గువాహటి, కోల్కతా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్.
విభాగాలు: ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ అర్హత ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500(సీబీటీ రాస్తే రూ.400 రీఫండ్). ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250. (సీబీటీ రాస్తే పూర్తి రీఫండ్)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 27.12.2025.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31.01.2026.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.03.2026.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.03.2026.
దరఖాస్తు సవరణ తేదీలు: 05.03.2026 - 14.03.2026.