గుజరాత్ రాష్ట్రానికి చెందిన రియా సింఘా (18) ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ టైటిల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున ‘మిస్ యూనివర్స్’ కిరీటం కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా 2024, సెప్టెంబరు 23న జరిగిన ఈ పోటీల్లో సుమారు 51 మంది ఫైనలిస్టులతో పోటీపడి రియా ఈ కిరీటాన్ని సొతం చేసుకున్నారు.