2025కు గాను ప్రతిష్ఠాత్మకమైన ‘రామన్ మెగసెసె’ అవార్డును భారత్కు చెందిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థ అందుకుంది. దీన్ని ఆ సంస్థకు 2025 ఆగస్టు 31న ప్రకటించించారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో 25 మందితో కూడిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ సంస్థ ఈ అవార్డును స్వీకరించింది. దీని వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్, సీఈవో గాయత్రి నాయర్ లోబో. ఈ సంస్థకు 55 వేల మంది వాలంటీర్లు ఉన్నారు.