రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్’ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని 2026, జనవరి 22న ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా, డీఆర్ఎం లలిత్బోహ్రా ఆవిష్కరించారు. ఈ రోబోకు రైల్వే పోలీసులు ‘ఏఎస్సీ అర్జున్’ అని పేరు పెట్టారు. ఏఐ, ఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తిస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారి చిత్రాలు తీసి విశ్లేషించి వారిని గుర్తించడంలో సహాయపడుతుంది.