గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
1. సైట్ అసెస్సర్- 06
2. ఫీల్డ్ ఇంజినీర్- 06
3. టెక్నీషియన్- 02
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సైట్ అసెస్సర్, ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.25,120; టెక్నీషియన్కు రూ.26,649.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
రాత పరీక్ష తేదీలు: 24.05.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.05.2025.
Website: https://www.rites.com/Career