ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్: 07
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీడీహెచ్ఆర్ఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 27.
Website:https://www.rites.com/Career