ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ కూటమి ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా(ఏకసభ్య కమిషన్) ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా గతంలో ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్దేశిత సమయంలో పకడ్బందీగా పూర్తి చేశారు.