Published on Jun 3, 2025
Current Affairs
రికార్డు గరిష్ఠానికి యూపీఐ లావాదేవీలు
రికార్డు గరిష్ఠానికి యూపీఐ లావాదేవీలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు 2025, మేలో రికార్డు గరిష్ఠమైన రూ.25.14 లక్షల కోట్లకు చేరాయి.

ఏప్రిల్‌లో నమోదైన రూ.23.94 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 5 శాతం ఎక్కువ అని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది. 

పరిమాణం పరంగా చూస్తే.. ఏప్రిల్‌లో 1,789.3 కోట్ల లావాదేవీలు జరగ్గా, మేలో ఆ సంఖ్య 1,867.7 కోట్లకు చేరాయి.

లావాదేవీల విలువ రూ.20.44 లక్షల కోట్ల నుంచి రూ.25.14 లక్షల కోట్లకు చేరడంతో, వార్షిక ప్రాతిపదికన వృద్ధి 23 శాతంగా నమోదైంది.