యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు 2025, మేలో రికార్డు గరిష్ఠమైన రూ.25.14 లక్షల కోట్లకు చేరాయి.
ఏప్రిల్లో నమోదైన రూ.23.94 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 5 శాతం ఎక్కువ అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది.
పరిమాణం పరంగా చూస్తే.. ఏప్రిల్లో 1,789.3 కోట్ల లావాదేవీలు జరగ్గా, మేలో ఆ సంఖ్య 1,867.7 కోట్లకు చేరాయి.
లావాదేవీల విలువ రూ.20.44 లక్షల కోట్ల నుంచి రూ.25.14 లక్షల కోట్లకు చేరడంతో, వార్షిక ప్రాతిపదికన వృద్ధి 23 శాతంగా నమోదైంది.