ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిలో భాగంగా యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు- 2026ను 2026, మార్చి 24న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సభలో ప్రవేశపెట్టారు. బహుభార్యత్వాన్ని నిషేధించే ఈ బిల్లుతో దేశంలో యూసీసీ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మొదట ఈ బిల్లును ఆమోదించి, అమలు చేస్తోంది.