భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలసంఖ్య పరంగా ప్రపంచంలోని దిగ్గజ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్లను వెనక్కినెట్టినట్లు పేసెక్యూర్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం, 2024 ఏప్రిల్- జులైలో యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా రూ.81 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఏడాదిక్రితం ఇదే కాలంతో పోలిస్తే ఈ విలువ 37% ఎక్కువ.
* సెకనుకు యూపీఐ ద్వారా 3,729.10 లావాదేవీలు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. 2022లో ప్రతి సెకనుకు 2,348 లావాదేవీలు జరిగాయి. అంటే యూపీఐ ప్లాట్ఫామ్పై సెకనుకు లావాదేవీల సంఖ్య 58% మేర పెరిగింది. ఈ విషయంలో చైనాకు చెందిన అలిపే, అమెరికా పేపాల్, బ్రెజిల్కు చెందిన పిక్స్ ప్లాట్ఫామ్లను యూపీఐ వెనక్కి నెట్టింది.