Published on May 19, 2025
Current Affairs
యునెస్కో అధ్యయనం
యునెస్కో అధ్యయనం

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమాటిక్స్‌ (స్టెమ్‌) కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి గత దశాబ్ద కాలంగా (2014-24) అనుకున్నంత పురోగతి కనిపించలేదని యునెస్కో అధ్యయనం వెల్లడించింది. ఈ విభాగాల్లో మహిళలు 35 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొంది. యునెస్కోకు చెందిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ (జీఈఎం) బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గణితం అంటే భయపడటం, లింగ వివక్ష ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ప్రస్తుతం నూతన సాంకేతికత అయిన కృత్రిమ మేధ రంగంలోనూ స్త్రీలు 26 శాతానికే పరిమితమయ్యారని వెల్లడించింది.