ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2025, ఆగస్టు 24న విన్పెగ్ (కెనడా)లో జరిగిన అండర్-21 మహిళల కాంపౌండ్ ఫైనల్లో చికిత 142-136తో యెరిన్ పార్క్ (కొరియా)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్లో చికిత 142-133తో పౌలా డయాజ్ (స్పెయిన్)పై చికిత నెగ్గింది.